పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 205


నెవ్వనివైభవం బెల్లయాచకులకు
        ముంగిటిపెన్నిధి భంగిఁ దోఁచు
నెవ్వనిసత్కీర్తి యీరేడుజగముల
        నాటపట్టుగ నిండి యాడుచుండు


తే.

నతఁడు సామాన్యజనుఁడె ధీరాధినాథ
నిర్మలాత్మకుఁ డత్యంతధర్మమూర్తి
శత్రుసమవర్తి నృపలోకచక్రవర్తి
సత్యసంధుడు విక్రమాదిత్యవిభుఁడు.

4


క.

అట్టివిభుం డుజ్జయినీ
పట్టణమున రాజ్యలక్ష్మిఁ బరఁగుచుఁ బ్రజఁ జే
పట్టి తగం బెంచి సంపద
దట్టంబుగ నిల్చి తల్లిదండ్రులమీఱెన్.

5


వ.

 అట్టిదినంబుల.

6


క.

అకళంకచిత్తుఁ డార్యుఁడు
సకలాగమమంత్రతంత్రసారజ్ఞుఁడు భి
క్షుకవేషధారి యవధూ
తకుఁ డనఁగా నపుడు వచ్చెఁ దత్పురమునకున్.

7


ఉ.

అచ్చటి దేవతాగృహమునందు గతస్పృహవృత్తి నుండఁగా
నచ్చెరువంది పౌరజను లాతనివర్తన విన్నవించినం
జెచ్చెరఁ దోడితెం డని ప్రసిద్ధులఁ బంచిన రాకతక్కినం
దచ్చరితంబుఁ జూడ వసుధావరుఁ డయ్యెడ కేఁగె వేడుకన్.

8


క.

అవనీసురరక్షకుఁ డగు
నవనీశ్వరవరుఁడు చనినయవసరమున న
య్యవధూతకల్మషుం డగు
నవధూతకుఁ డతనిఁ గరుణ నవలోకించెన్.

9