పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4)

xxv


   జ్యోతిర్మధ్యమునన్ వెలింగెడు హిమాంశుంబోలి సొంపొందుచో
   జ్యోతిశ్శాస్త్రవిదుండొకండు ధరణీశుంగాంచి దీవించుచున్.

క. సర్వశుభంబులు నీకడ
   నిర్వాహము కలిగియుండు నీకేమని యా
   శీర్వాదం బొసఁగుదు నా
   యుర్వృద్ధి దలంప నవియ యునికికిఁ గోరున్.

సీ. ఐదింటఁ దానొప్పఁడట నెన్మిదింటఁ దొ
          మ్మిదియింటఁ బండ్రెంట మేలు శుక్రుఁ
   డిందుఁ డాఱింటను నేడింట మూఁటను
          బదిటఁ జేకొన్న శుభప్రదుండు
   శని రాహు కేతు భూతనయ సూర్యులు మూఁట
          నాఱింట మే లర్కుఁ డట్ల పదిట
   రెంట నైదింట నేడింటఁ దొమ్మిదిటను
          గురుఁ డున్ననెల్ల కోర్కులు ఫలించు

   బుధుడు బేసిగాని పొందుల నిష్ఠుఁడౌ
   వీనికెల్ల దుష్టవేధ లేమి
   ఫలము లొప్పు జనన భవనంబు మొదలుగాఁ
   పదునొకంట నున్నఁ బరమ సుఖము.

గీ. అందు రవితనుజాది మహాగ్రహంబు
   లిప్పు డాఱింటనునికి నీ యిష్టమొనరు
   గురుఁడు బుధుఁడును బైపయికొనుట మేలు
   శుక్రచంద్రులు మూఁట నిల్చుట శుభంబు.

వ. అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి,