పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170 సింహాసన ద్వాత్రింశిక

ఉ. అప్పుడు రక్తభోజిని తధస్త్రము వట్టి ప్రసన్నచిత్తయై
కప్పు తనూలత న్మెఱయఁగా నృపుముందట నిల్చి వేఁడు మే
నిప్పుడు మెచ్చితి న్వరము లిచ్చెద నావుడు మ్రొక్కి యాత్మలోఁ
దప్పనిభ క్తితోడ వసుధాపతి పల్కె నుదారవృత్తియై. 119

క. ఇచ్చటఁ గోరినకోరిక
లిచ్చెదనని యానతిచ్చి తే నడిగెద నో
కచ్చెరువుగ నీతలఁపున
నిచ్చెఱు విదె నిండఁజేయు మిప్పుడు తల్లీ. 120

ఆ. అనుడు దేవిపల్కె నవనీశ నీధర్మ
బుద్ధిఁ జెఱువు దానె పూర్ణమయ్యె
ధార్మికులకు సిద్ధితడయునే కప్పలఁ
గాచి యెలుక పాము గతికిఁ బుచ్చె. 121

శంఖపాలుని కథ



క. అనవుడు జనవిభుఁ డది యె
ట్లని యడిగిన దేవి చెప్పె నాకథ యిదిగో
వినుము హిమాద్రిసమీపం
బునఁ గడు లోఁతైన మడుఁగు పొలుపై యుండున్. 122

క. ముదమున నందుల కప్పలు
వెదవెట్టిరె వెట్టికోరు వెట్టిరె యెదురే
కదకడ దక్కుము పొదపొద
యదె వరవర వాఁగురూఁగు రనుచుం జెలఁగున్. 123

క. అట కంతటను ఫణత్రయ
పటుతరుఁడై యొక్కశంఖపాలుం డను పే