పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156 సింహాసన ద్వాత్రింశిక

తే. డిదియ మేలని తనతల గదియఁ దుఱిమెఁ
దొలుత దేవయోగ్యములనఁ దోడి యాతఁ
డిష్టదేవత కర్పించి యెలమిఁ బిదప
వీని ముడిచెద నని యొడిలోన దాఁచె. 53

చ. ఇరువురచేష్టలం గని మృగేక్షణ యల్లన లేచి హంససుం
దరగతి లోనికిం జనినఁ దండ్రియు నిద్దఱుపేళ్ళు జాడలుం
జరితములుం దగం దెలిసి సామ్యము గల్గిన వీరిలోన నె
వ్వరి నవుఁగా దనం జను వివాదము బాలికచేతఁ దీఱెడున్. 54

క. ఆతరుణి మెచ్చి కైకొను
నాతఁడె మాయల్లుఁ డనుచు నచటికిఁ జని క
న్యాతిలకముఁ జంకిట నిడి
వాతెఱ ముద్దిడుచు బుజ్జవంబునఁ బలికెన్. 55

గీ. ఒడిఁ బ్రసూనముల్ దాఁచె రత్నోద్భవుండు
తుఱిమికొని యుండెఁ జంద్రకేతుండు దొల్త
నీకొలది యిద్దఱంచను నీకుఁ జూడ
నొప్పుగా రసికుఁ డెవఁడొ చెప్పు మనిన. 56

క. పువ్వులు గొను మని యిచ్చిన
యువ్వేళన తుఱుముకొన్న యతఁ డెవ్వఁడొ వాఁ
డివ్వసుమతి నస్థిరుఁ డగు
నవ్వంబడు నొరులచేత నాకుం జూడన్. 57

వ. అనినఁ దండ్రి విని యితండె జాణ యని నాకు నీతివాక్యంబు దోఁచుచున్న యది యెట్లనిన. 58

క. వనితాభోగము లంచము
ధనము సుభాషితము విరులుఁ దాంబూలముఁ బం