పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 153

నానతిమ్ము నాకు నని విన్నవించిన
భైరవేశ్వరుండు పలికె నిట్లు. 37

క. రత్నోద్భవుఁ డనఁగా నొక
రత్నవ్యవహారిసుతుఁడు రత్నంబుల కీ
రత్ననిధిలోనఁ దిరుగుచు
యత్నంబున నిచట విడిసె నాప్తులుఁ దానున్. 38

క. తద్వేశ మఱియు నొకఁడు స
రిద్వల్లభసలిల ముత్తరింపఁగ నొకచో
నుద్వాహమునకు నేగుచు
నీద్వీపముఁ జేరె నిజసుహృద్వర్గముతోన్. 39

వ. ఇక్కడ నయ్యిద్దఱు ని ట్లొండోరువుల మహిమలు మెఱయింపుచుఁ గలసి మాటలాడునెడ రత్నోద్భవుండు నీనామం బెద్ది యేదేశంబునుండి యెచటి కేఁగుచున్నాఁడ వనిన నతండు నేఁ జంద్రకేతుం డనువాఁడ మగధదేశంబునుండి రత్నద్వీపంబున కేఁగుచున్నవాఁడ నందొక విశేషంబు గలదు. 40

క. పద్మాకృతి రేఖలు కర
పద్మంబుల నొప్పుచుండఁ బద్మకు నెనయై
పద్మావతి యనుకన్యక
పద్మాసన గలదు జాతి పద్మిని యనఁగన్. 41

క. ప్రస్తుతలావణ్యగుణని
రస్తప్రసవాస్త్రమోహనాకారిణి సం
త్రస్తకురంగేక్షణ తా
లస్తని యది మదనరాజ్యలక్ష్మియుఁ బోలెన్. 42

చ . కలువలుఁ జక్రవాకములుఁ గంజములు న్బిసకాండము ల్మనం
బలరఁగ దీని లోచనకుచాననబాహుసమానలక్ష్మి గా