పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 117

వ. అని చెడనాడుచున్న యెడను. 67

ఆ. దేవదత్తుఁడు నరదేవుని సద్గుణం
బెఱింగి సంతసించి యింటి కేగి
చందమామకూనచందంబుతో నున్న
శిశువుఁ దెచ్చి రాజుచేతి కిచ్చె. 68

వ. ఇట్లిచ్చిన పాపనిం జుచి. 69

క. విస్మయహర్షంబుల మం
దస్మితవదనాబ్జుఁ డగుచు ధరణీవరుఁ డా
కస్మికదురితము లడఁచెడి
యస్మత్కులదైవ మనుచు నతనికి మ్రొక్కెన్. 70

ఉ. మ్రొక్కిన దేవదత్తుఁ డతిమోదము నొంది నరేంద్ర నీమనం
బిక్కడఁ జూడవేఁడి యలయించి మహావ్యథఁ దూలపుచ్చితిన్
మిక్కిలి తప్పుచేసి కడమీఱి భవద్గుణరత్నముల్ మెఱుం
గెక్క నొనర్చితిం బరుల కీకథ మంచితనంబు నొజ్జఁగాన్. 71

శా. అంచుం జెప్పిన నయ్యవంతివరుఁడున్ హర్షించుచు న్సంపదం
గంచిం బోలినయట్టి పట్టణము సత్కారంబుగా నిచ్చి మ
న్నించెం బాత్రుఁ డటంచు ధర్మసభకు న్నిర్ణేతగాఁ బ్రీతిఁ గా
వించెం గావున నీకు నట్టిగుణ మన్వేషించినం గల్గునే. 72

క. మగుడుము గద్దియ యెక్కుట
యగపడ దిఁక ననిన విక్రమార్కుగుణంబుల్
పొగడుచు బిగిచెడి ధారా
జగతీపతి చనియె నాత్మసదనంబునకున్. 73

వ. మఱియు నొక్కనాఁడు. 74