పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 89

గరికరంబులమేనఁ గర్కశభావంబు
లేకయుండిన నూరులీలఁ బోలుఁ
జక్రవాకంబులు సడిసన్న రేయెల్ల
బాయకుండినఁ జనుదోయిఁ బోలుఁ
జుక్కలఱేఁడు దా స్రుక్కక పొంగక
కందకుండిన ముఖకళలఁ బోలుఁ
ఆ. జంచరీకచయము సంచలింపక కూడి
నిలిచెనేని కురుల చెలువుదాల్చుఁ
బువ్వు దీఁగె మొదలిమవ్వంబు దప్పక
ననిచెనేని మేనియనువుఁబడయు. 119

మ. తనలావణ్య మగణ్యదర్పమయమై తారుణ్యపూర్ణంబుగా
ననవద్యద్యుతితోడ నానృపతికన్యారత్న మేరాజనం
దనుల న్మెచ్చక మీఁది మేడకడ గంధర్వాంగనావిభ్రమం
బున నుండెన్ మృదువస్త్రగంధసుమనోభూషాదిభోగంబులన్. 120

సీ. తరుణి యీక్రియ మేడఁ దరలకుండుటయును
దెలిసి గౌళికుఁ డనుధీరవిటుఁడు
చాయలయుక్కునఁ జక్రంబు గావించి
కాష్ఠయంత్రంబున గరుడిఁ జేసి
తా విష్ణుఁడై మన్మథప్రథనమునకు
మెఱపుగాఁ గస్తూరి మిగుల నలఁది
పసపువన్నియ పట్టువసనంబు గావించి
తిరునామ మొప్పఁగాఁ దీర్చి కడఁక
తే. నెక్కి కీలున వాహన మెగయఁజేసి
పవనపథమునఁ జనుదెంచి బాలమ్రోల