పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్చినఁ బూజించి మునీంద్ర నామహిమకుం జేటయ్యెఁబో నీవు చె
ప్పినమర్యాదయు నెట్లు దప్పె ననినం బృథ్వీశు బోధించుచున్. 34

క. మర్యాదఁ దప్పెఁ జిత్తవి
పర్యాసాహంకృతులను బార్థివ “గర్వా
త్కార్యం వినశ్యతి" యనుచు
నార్యులు మును చెప్పునీతి యదితప్పగునే. 35

క. పర్వతపథమున రథమును
బర్వస్త్రీసంగమమున బ్రాహ్మ్యవ్రతమున్
గర్వము నధర్మకార్యము
నుర్వీభాగమున నావయు న్నడవ దనా. 36

క. ఇంతమహిమ వడసితి నని
సంతసమున నీవు రాజసము గైకొన్నన్
సంతతముఁ జేయు సుకృతం
బింతయు నిట్లింకె నింక నే మనవచ్చున్. 37

ఉ. నావుడు భూవరుండు మునినాయక నే నపరాధి నైతి నేఁ
డావిధ మేక్రియం గలుగు నానతి యి మ్మని మ్రొక్కినంత నా
దేవమునీంద్రుఁ డి ట్లనియె ధీరుఁడ వై మది నుబ్బు లేక భూ
దేవసపాదలక్షఁ బరితృప్తి యొనర్పుము భుక్తిముక్తులన్. 38

క. బహుదినములు జరపఁగఁ ద
న్మహిమయుఁ జేకూరు నింక మనమున గర్వా
గ్రహము వల దనుచు శుభ మెం
దుహితంబుగఁ జెప్పి నారదుఁడు సనినంతన్. 39

క. తాఁకిన మఱి వంగినక్రియ
నాఁకొని వడిపండుకొన్న యనువున నృపుఁడుం