పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 71

క. కృతిఁ గుండలు నిలిచిన స
త్కృతి గనుఁగొని నారదుండు దినమును నీ వీ
గతిఁ బుణ్యకీర్తి వెలయిం
పు తపోనిష్ఠలను వెలసి పుణ్యవిచారా. 28

వ. ఆని యుపదేశించి చనిన. 29

ఆ. ఇట సుదర్శనుండు నీ మట్టికుండల
నిచ్చ వండిపెట్ట మెచ్చుగాదు
మంటఁ జేసి మొదలి వంటనే కఱిగొన్న
దానఁ దొలుత వండఁ దగుట యెట్లు. 30

మ. అని మృద్భాండము లెల్లమాని సికతాయత్తంబు లౌ కుండలన్
ఘనుఁ డాపాయసశాకసూపముల పాకం బెప్పుడుం జేయుచుం
దనియన్ బ్రాహ్మణభోజనంబు లిడుచుం దానొక్కనాఁ డప్పదా
ర్థనికాయంబులు వండుచోటఁ జని తత్సామగ్రి వీక్షింపఁగాన్. 30

క. వెస లుడుకం గని నృపుఁ డు
బ్బసమున నే నిట్టిఘనత వడసితి ననఁగా
నిసుమునఁ జేసినకుండలు
విసవిసలై విరిసెఁ బుణ్యవిపరీతగతిన్. 32

క. ఉలికి యతం డప్పుడు మదిఁ
గలఁగుచు నిటఁ గల్మషంబు గలసెనొ తగు వి
ప్రులయెన్నిక గూడదొ హో
తలు మంత్రముఁ దప్పిరొక్కొ ధర గదలెనొకో. 33

మ. అని యుత్సాహవిహీనుఁ డౌచు నతిచింతాక్రాంతుఁడై యుండగా
దనయిచ్ఛన్ముని తొంటిచాడ్పున వియద్భాగంబు శోభిల్ల వ