పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



బడరు బ్రియంబుఁ గోపము నయంబు సమంబులు దానఁగొండె మే
ర్పడ విను రక్తపుష్పపటరాగిణి శంఖనిఁగా నెఱుంగుమీ. 215

ఉ. అన్నువ యైన కౌనుఁ గుటిలాలక పంక్తియుఁ జెన్ను మీఱఁగా
వన్నెలు గట్టుఁ బచ్చమరువంబులునుం దుఱుమంగ నేర్చు మా
ఱున్నెడఁ గన్నులార్చు సురతోద్ధతి నేర్పరి యల్పభుక్తితోఁ
దిన్నని మాటలాడుఁ గడుఁద్రిమ్మరి చిత్తిని చిత్రవిక్రియన్. 216

ఉ. తెల్లనిచీరలు న్విరులుఁ దియ్యఁదనంబును మెచ్చు వెండ్రుకల్
నల్లన మోవి యెఱ్ఱన కనత్కనకద్యుతి మేను గన్ను లు
త్ఫుల్లసరోజరోచులు మృదుధ్వని కంఠము పాణిపాదముల్
పల్లవకాంతు లాననము పద్మము పద్మిని జాతి కిమ్మహిన్! 217

క. కలియుగమునఁ బద్మిని స
త్కులమున లేదిది తదీయగుణములు గల కో
మలిగాన నెడమ లోఁదొడఁ
దిల ప్రమాణంబు మచ్చ దిరమై యుండున్. 218

ఆ. అనుఁడు వెఱఁగు పడుచు నచ్చిత్రకుఁడు భీతి
తోడ నేగి పువ్వుఁదోఁటలోనఁ
జెలఁగు నప్పున కిట్లె చెప్పిన నతఁడు గో
ప్యస్థలంబు గనుట కాత్మఁ గలఁగి. 219

ఉ. నందనరమ్యమౌ గృహవనమ్మున మన్మథకేళివేళ నా
నందుఁడు భామవామజఘనంబున సన్నపుమచ్చఁ గాంచి యా
నందము డింది కందు మది నాటుకొనం దలయూఁచి శారదా
నందుని సద్గుణం బవగుణంబుగఁ గైకొని వచ్చి మంత్రితోన్. 220

ఆ. ధర్మమూర్తి యనుచు నిర్మలాత్మకుఁడని
నమ్మినార మిట్టి నాటకములఁ