పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

మంజువాణి


పటుతరకవితానిభాసితప్రతిభుండు
                  సకలాంధ్రలక్షణచక్రవర్తి
రఘుకులేశనిదేశరవితమహాభాగ
                  వతపురాణుఁడు పుణ్యవర్ధనుండు


గీ.

బుధజనహితుండు బమ్మెరపోతసుకవి
యెన్న రేఫఱకారంబు లెఱుగ డనుచు
నజ్ఞు లొకకొంద రాడుదు రమ్మహాత్ము
కవిత కెందును లోపము గలుగ దభవ.

265


సీ.

ఘనుడు పోతనమంత్రి మును భాగవతము ర
                  చించి చక్రి సమర్పించునెడల
సర్వజ్ఞసింగయక్ష్మావరుం డది దన
                  కిమ్మని వేఁడిన నిడకయున్న
నలిగి యాపుస్తకం బవని బాతించిన
                  జివికి యందొకకొంత శిథిలమయ్యె
గ్రమ్మర నది వెలిగందల నారప
                  రాజును మరి బొప్పరాజు గంగ


గీ.

రాజు మొదలగు కవివరు ల్దేజ మెసఁగ
జెప్పి రాగ్రంథములయందె తప్పు లొదవె
గాని పోతకవీంద్రునికవితయందు
లక్షణం బెందు దప్పదు దక్షహరణ.

266


వ.

పోతరాజు చెప్పినవి ప్రధమస్కంధమును ద్వితీయస్కంధమున కొంతయు షష్టసప్తమాష్టమనవమస్కంధములును దశమస్కంధము పూర్వభాగము కొంతయు నున్నది. అందులో రేఫఱకారసాంకర్యము లేకుండుటకు వ్రాయుచున్నాము.