పుట:సత్యశోధన.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశకుల విజ్ఞప్తి

మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంలో వారు స్థాపించిన నవజీవన ట్రస్టు పక్షాన వారి ఆత్మకథను భారతీయ భాషలన్నిటి పక్షాన వారి ఆత్మకథను భారతీయ భాషలన్నిటిలోను ప్రచురించాలని నిర్ణయించాం. ఆ ప్రకారం శ్రీ వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగులోనికి అనువదించిన మహాత్ముని ఆత్మకథను ప్రచురించాం. తెలుగు ప్రజలు మా యీ కృషిని అభినందించారు. ఇప్పటికి 40,000 ప్రతులు కొని చదివి మమ్ము ప్రోత్సహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ న్యాయ నిర్ణేతలు మహాత్ముని ఆత్మకథ తెలుగు సేతను 1995 వ సంవత్సరం ఉత్తమ తెలుగు అనువాదంగా నిర్ణయించి 5000/- రూపాయల పురస్కారం యిచ్చి శ్రీ రాధాకృష్ణమూర్తిని సత్కరించడం ముదావహం. గాంధీజీ ఆత్మకథను భారతీయ భాషలన్నింటిలోను ప్రచురించాం.

మహాత్ముని ఆత్మకథ యెడ భారతదేశ ప్రజల ఆదరాభిమానాలు చూచి నవజీవన ట్రస్టు మరో ప్రణాళికను చేపట్టింది. మహాత్ముడు రచించిన రచనలో నుంచి విషయాన్ని బట్టి కొన్నింటిని ఎంపికచేసి సంపుటముల సెట్టు రూపంలో ప్రచురించి, తక్కువ ధరకు దేశ ప్రజలకు అందజేయాలనునదే ఆ ప్రణాళిక. ప్రప్రధమంగా ఇంగ్లీషు భాషలో నవజీవనట్రస్టు పక్షాన ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలను ఆరు సంపుటముల సెట్టుగా ప్రచురించాము. ఆ గ్రంథాలు అపరిమితంగా ప్రజల ఆదరణను చూరగొనడం వల్ల పెద్ద సంఖ్యలో అనేకసార్లు ప్రచురించి ప్రజానీకానికి అందజేశాము. భారతీయ భాషల్లో కూడా ఈ ప్రణాళికను అమలుపరచుటకు నిర్ణయించి గత సంవత్సరం మళయాళం భాషలో అయిదు సంపుటముల సెట్టుగా ప్రచురించి కేరళ ప్రదేశ్ ప్రజల మన్ననలు పొందామని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

ఇప్పుడు తెలుగులో 5 సంపుటాల సెట్టును నవజీవన ట్రస్టు పక్షాన సబ్సిడీ రేటుకు ప్రచురిస్తున్నాము. మహాత్మాగాంధీ సిద్ధాంతాల యెడ మక్కువ చూపే తెలుగు ప్రజలు మా యీ కృషిని అభినందించి ప్రోత్సహిస్తారని విశ్వసిస్తున్నాము. ఈ అయిదు సంపుటాలను తెలుగులో ప్రచురించుటకు అయ్యే ఆర్థిక వ్యయాన్ని పూర్తిగా నవజీవన ట్రస్టు, అహమదాబాద్ భరిస్తున్నది. ట్రస్టుకు సంబంధించిన యితర శాఖల ఆదాయాన్ని