పుట:సత్యభామాసాంత్వనము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105

తే. గాన ని ట్లంగములు పరాధీనవృత్తి
     నానినటు లైన మరునైన నసురనైన
     నతనుసంగరమున నుల్ల మతిశయిల్ల
     నెటులు గెలిచెదనో కాక యింతి లేక.

మ. ప్రమదారత్నముఁ జూడకున్న నవలాపాదాబ్జపాంసుచ్ఛటన్
     క్షమ లేఁజెమ్మటజాలునన్ సలిలమున్ చారుస్మితజ్యోత్స్నఁ దే
     జము నిట్టూర్పున గాలి కౌనున బయల్ సంధిల్ల జీవంబు జీ
     వము నేకంబు ఘటింతుఁగాని సమరవ్యాపార మిం కెంతునే.

క. నావుడుఁ జెలికాం డ్రావసు
     దేవాత్మజుఁ జూచి యతనితీరును నవలా
     రావలె నటన్నతలఁపును
     భావంబున నెంచి మగుడఁ బల్కిరి వేడ్కన్.

క. దేవరయానతి మదిలో
     భావించిన యుక్త మగును పద్మదళాక్షా
     తావి నెడఁబాసియుండెడి
     పూ వెందుకు నట్ల కాదె భువి నీనడకల్.

క. చంద్రు నెడఁబాసి యుండునె
     చంద్రిక చంద్రికను బాసి చరియించునొకో
     చంద్రుం డిపు డాకైవడి
     జంద్రముఖియు నీవు నెనసి చరియించుగతుల్.

క. నీ మమత తెలిసెనేకద
     భామామణి యచట నెంత పలవించునొకో
     మీమనసులు మీవలపులు
     కాముఁ డెఱుఁగుఁగాక యొరులు కానంగలరే.

క. నావుడుఁ జిఱున వ్వొలయఁగ
     భావజజనకుండు వికచపద్మదళాక్షిన్