పుట:సకలనీతికథానిధానము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సకలనీతికథానిధానము


వ.

..........భూపాలుండు పరామరిశించునపుడు, మేకచన్ను గుడిచి పెఱిగినదని విని విస్మితుండయ్యె మఱియును.

166


క.

శయ్యాసంగున కొకమృదు
శయ్యాస్థలి చూపనందు శయనించెడుచో
శయ్యాధస్థలరోమం
బయ్యడ మే నొత్తె ననిన నదియును నడుగన్.

167


చ.

ఆభూపాలుండు వానిశరీరంబుననున్న తదీయలాంఛనంబు చూచి మువ్వుర సంతోషించి యేలె, మువ్వురియందును సుకుమార వివేకు లెవ్వరని యడిగిన విక్రమార్కుం డిట్లనియె.

168


క.

వనితాసంగుండును భో
జనసంగుఁడు బుద్ధిచేత సాధించిరి శ
య్యను క్రింద నున్న రోమము
తనులాంఛన మగుట నధికతమ మన్నిటిలోన్.

169


క.

పుట మెగసి మూ పుడిగి య
చ్చటికిన్ బేతాళుఁ డరుగ జనపతి చని యు
ద్భటవృత్తి బట్టి(కొనిరా)
(నట నొక)కథ చెప్పదొడఁగె నద్భుతభంగిన్.

170


వ.

అది యెట్టి దనిన.

171


సీ.

ఉజ్జయినీపురి నొక్కవిప్రుఁడు హరి
        స్వామి, వేదస్వామి నామసుతుని
సోమప్రభానామసుతను గాంచిన నది
        వయసైన దగుపట్టి వరని నరయ
జ్ఞానియు మఱియు విజ్ఞానియు శూరుండు
        ననువారు ముగురు దత్తనయ నడుగ
జ్ఞానికి దండ్రి విజ్ఞానికిఁ దల్లియు
        శూరున కక్కన్య సోదరుండు