పుట:సకలనీతికథానిధానము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

91


క.

వీరవరు జూచి శూద్రకుఁ
డారాత్రిది యేడ్పువివరమది యెట్టిదినాన్
భూరమణ యొకపిశాచము
దారోదన మదియు నడఁగె నన చెప్పుట(యున్).

159


వ.

అతనివలన సంతోషించి యారాత్రివృత్తాంతంబు నమాత్యుల కెఱంగించి యతనికి మఱియు ననేకపదార్థంబు లిచ్చి (పుచ్చి రాజ్యమ్ము సేయు)చుండె నని చెప్పి బేతాళుం డిట్లనియె.

160


క.

ఈ యేవురిలో సాహస
మేయతనిది యన్న భటున కిది ముఖ్యము, భూ
నాయకుఁడు దెగదలంచుట,
నీయందఱియందు నధికుఁ డితఁ డని పలుకన్.

161


వ.

ఎప్పటియట్ల తిఱిగి పరచినం బ్రతిక్రమ్మరం దెచ్చిన బేతాళుం డిట్ల యంగదేశాధిపతి(కడకు) విష్ణుస్వామి యనునతనిసుతులు ముగ్గురు వివేకనిధానులు గొలువంబోయిన మీ రేమిటి కెఱుఁగుదు రనిన భోజనశయనారీవారిసంగుల మనిన నభ్బూవరుండు.

162


క.

భోజనసంగునకును దగు
రాజనమన్నంబు పెట్ట బ్రాహ్మణసుతుఁ డ
బ్భోజన మొల్లకడించెను
వ్యాజంబునఁ గమరుకంపువలచిన దనుచున్.

163


వ.

(భూపాలుండు) వీని పరీక్షించునపుడు స్మశానక్షేత్రంబున పండినధాన్యం బని యెఱింగి సంతోషించె మఱియును.

164


క.

నారీసంగునికడ కొక
నారీమణి బంప బాన్సునం బడువేళన్
చేరంగనీక దానిని
వారించెను మేకగదరువలచినదనుచున్.

183