పుట:సకలనీతికథానిధానము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

85


సీ.

అంతిపురంబున నర్ధరథుండను
        వైశ్యపుత్రుఁడు ధనవంతుఁ డనెడు
నతఁ డాత్మభార్య లోకాంతర మరిగిన
        విటవిదూషకవృత్తి విత్తమెల్ల
బోకార్చుకొని సర్వభూములు దిరుగుచు
        నందనపురమను నగరి చేరి
యందు హాటకగుప్తుఁ డనువైశ్యుఁ డాత్మజ
        బింబోష్ఠి నతనికి బెండ్లి సేయ


ఆ.

.......................
బ్రియము చెప్పి యింట బెట్టుకొనిన
నతడు కొన్నిదినము లరిగినఁ దనపత్ని
నమ్మజూపి తెత్తు ననుపు మనిన.

128


ఆ.

కొడుకు మారుగాఁగ గోరి నాయింటిలో
పెద్దతనముచేత బెట్టుకొంటి
ననుచు దుఃఖపడిన నాతని నమ్మించి
యెల్లివత్తు ననుచు నిచ్చగించె.

129


వ.

అల్లునిం గూఁతును ననేకవస్త్రాభరణభూషితులఁ జేసి యొక్కదాసి నిచ్చి యనిపిన పత్నీసహితుండై చనుచుండి యొకగహనమధ్యంబున నయ్యాభరణంబు లన్నియుం బుచ్చుకొని తనభార్యను నద్దాసిని నొక్కప్రానూఁతం బడండ్రోచి యెందేనియుం జనుటయు.

130


క.

ఇరువురును మొఱలువెట్టగఁ
దెరువరు లరుదెంచి పెద్దతీఁగలచేతన్
దరుణిని వెడలగ దివియుచు
మఱి దాసిన్ దివియబోవ మరణమునొందెన్.

131