పుట:సకలనీతికథానిధానము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

సకలనీతికథానిధానము


నాగతాతీతమనాగతంబు నెఱింగి
        విరచింపనేర్చు వివేకశాలి
నడిగె నాకింకఁ బ్రియాంగన యెవ్వతె
        యనిన మాగధరాజతనయ చంద్ర


తే.

కాంతయనుకన్య యనుచు శుకంబు చెప్పె
నట్లు మగధేశుసుతయు తా నాడుజిలుక
నడుగ, జెప్పెఁ బరాక్రమహరి యటంచుఁ
బెద్ద లంతట నిరవురఁ బెండ్లి సేయ.

122


వ.

నాచంద్రప్రభయుం బరాక్రమకేసరియుం క్రీడాగృహంబున రతి(పరాయ)ణులై యున్న సమయంబునఁ బంజరద్వయంబుననున్న కీరద్వయంబునందు రాచిలుక శారికం జూచి యిట్లనియె.

123


ఉ.

ఊరక యేలయుండ మనమో శుకరత్నమ యస్మదీయసం
చారవినోదముల్ కలసి సల్పుదుమన్న తలంకుచున్నచో[1]
కీరమపూరుషుల్ బహులకిల్బిషదారు లసత్యభాషణుల్
క్రూరులు వారితోఁడ నొనఁగూడి మనంగలరే వధూమణుల్.

124


వ.

అని విడనాడిన కీరంబు శారికం జూచి యిట్లనియె.

125


చ.

తరుణుల నమ్మవచ్చునె వృథాకలహాత్మలు కల్మషక్రియా
భరితలు చంచలాక్షులు కృపారహితల్ పరభోగవిభ్రమా
భరణలు మానదూరలును భావవిహీనలు క్రూరకర్మని
ష్ఠురబహుభాషణల్ కలయఁజూచిన దోషము రాకయుండునే.

126


క.

అని యిరువురు వాదడవఁగ
మనుజేంద్రుఁడు చేరి వాదు మానుఁడు మీవ
ర్తనములు చెప్పుం డనవుఁడు
ననియెన్ శారిక మహీవరాత్మజుతోఁడన్.

127
  1. తలింకిశారియో