పుట:సకలనీతికథానిధానము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

సకలనీతికథానిధానము


ఆ.

దంతఘాటకుండు తనయకు దుఃఖంచి
(?) చచ్చి నతనిసతియు జిచ్చుచొచ్చె
పాప మెవ్వరికిని బ్రాపించు ననవుఁడు
సనియె సాహసాంకు డాత్మ దెలిసి.

111


వ.

బుద్ధిశరీరుండు స్వామిహితంబునకు గపటంబు చేసిన దోషంబు లేదు అవిచారంబున నారాజు ప్రధానినందనను వెళ్ళగొట్టించెం గావున నాప్రధానమరణదోషంబు రాజునకు ప్రాప్తం బగునని పలికిన మరలి వటంబునకు బరచి యప్పటియట్ల వ్రేలుచున్న నివ్విక్రమార్కుఁడు.

112


క.

వెంటనె చని బేతాళుని
నంటంగా బట్టి తొంటియట్లనె చనుదే
నొంటిజన దెరువు జరగదు
వాటిన్[1] గథ యొకటి గలదు వినుమని పలికెన్.

113


సీ.

బ్రహ్మశంఖాగ్రహారంబువ నగ్నిషో
        మీయుని నందన మీననయన
మందారవతియను నుందరి వరియింత
        మని విప్రనందను లరుగుదేర
నంత నక్కన్య కాలాంతంబు నొందిన
        విడిచిపోవఁగ లేక విప్రులందు
నొకఁ డస్థి గొనుచు గాశికి నేగె నొక్కండు
        కాటిబూడిద భక్తి గాచియుండె

114


తే.

యొకడు దేశాంత్రియై చని యొక్కవివ్రు
నింట భుజియించనున్న నాయింటిగృహిణి
కొడుకు గోపించి యయ్యగ్నికుండము నను
వైచుటయు మృతినొందిన వానిఁ జూచి.

115
  1. వింటే