పుట:సకలనీతికథానిధానము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

సకలనీతికథానిధానము


క.

రవి గ్రుంకి మధ్యరాత్రం
బవుటయు రజ్జువు గదల్చి యమ్మార్గమునన్
యువిద బొడగాంచి మదనో
త్సవలీలల మెలఁగుచుండె చతురత మెరయన్.

100


వ.

ఇవ్విధంబున పద్మావతీపరాయణుండై వజ్రమకుటుండు మంత్రిసుతుండైన బుద్ధిశరీరుని మఱచియుండు నాసమయంబున నొక్కనాఁడు.

101


క.

కులమును నాచారంబును
చెలికానిని గురువు బుత్రుజేరినవానిన్
తలిదండ్రుల బాంధవులను
తలఁపరు కామాంధజనులు తత్పరవృత్తిన్.

102


తే.

అనుచు పద్యము లిఖయించి యతివచేత
ననుప భూపతీసుతుఁడు పద్యంబు చదివి
మఱచితిని మంత్రిసుతుని నీమర్మ మెల్ల
నాకు నెఱిఁగించి నట్టివివేకనిధివి.

103


వ.

అనినఁ బద్మావతి యిట్లు బుద్ధిశరీరుని యిన్నిదినంబులుదాక యెఱిఁగింప కిట్లేల చేసితివని భక్తి గలదియును బోలె నొక్కనాఁడు.

104


ఆ.

భవ్యభోజ్యలేహ్యపానీయచోష్యప
దార్థములను గరళ మావహించి
మంత్రిసుతున కనుప తంత్ర మాతఁ డెఱింగి
తగరు కిడిన జచ్చె తన్నికొనుచు.

105


వ.

అవ్విధంబున వజ్రమకుటు నట్లుగ లిఖించి (?) పద్మావతి హారంబులు పుచ్చికొని స్తనమధ్యంబున నఖక్షతత్రయంబు నిలిపిరమ్మని పత్రిక పంపిన నారాజకుమారుండు అట్ల చేసి యేతెంచుటయును.

106