పుట:సకలనీతికథానిధానము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

71


క.

మిత్రద్రోహి కృతఘ్నచ
రిత్రులు విశ్వాసపాతకికృతులా(...)భూ
....త్రాది నరకములు నా
గోత్రార్కము ఘోరదశల గుందుదు రెపుడున్.

47


వ.

అనిన మూడవయక్షరంబును విడిచి 'రా'యని పల్కుటయును.

48


క.

రాజును రాజకుమారుఁడు
తేజము మదిగోరి రేని దేవార్చనమున్
భ్రాజితదానము హోమము
రాజసమున విక్రమంబు రక్షయు వలయున్.

49


వ.

అనిన 'రా' యక్షరంబు విడుచుటయు తోడనే విభ్రాంతి బాసినకుమారునిం జూచి సంతోషచిత్తుండై యితం డడవిలో చేసినపని యెఱిఁగితి రనిన శారదానందుం డిట్లనియె.

50


క.

(దేవ)బ్రాహ్మణభక్తి
ప్రావీణ్యున కెఱుఁగవచ్చు భావంబున నీ
దేవితొడమచ్చ దెలిసిన
భావముననె యనుచు బలుక బార్థివు డంతన్.

51


వ.

శారదానందునకు నమస్కరించి కొనియాడి మంత్రియగు బహుశ్రుతునిం జూచి యిట్లనియె.

52


క.

హితవును బుద్ధియు గలిగిన
మతిమంతుఁడు మంత్రియైన మనుజేంద్రునకున్
గతియును రాజ్యము భోగ
స్థితియును గీర్తియును గల్గు సిద్ధము సుమ్మీ.

53


వ.

అని మంత్రిఁ గొనియాడి శారదానందుని నర్థరాజ్యంబు గైకొనుమనుటయు.

54