పుట:సకలనీతికథానిధానము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

59


క.

వాసుకి తనపుత్రునికై
యాసురసైన్యముల బంప నాసైన్యములన్
వాసిచెడ నురిపి విడిచిన
నాసాహసమూర్తి వినియె హతశేషులచే.

343


క.

విని కోపంబున దా నే
గిన నబ్బాలకుఁడు కోలఁ గెడపిన గూలెన్
ఘనుఁడైన విక్రమార్కుఁడు
ఘనహీనత లొక్కరూపకాలంబునకున్.

344


క.

కాలవశంబున నొకపసి
బాలునిచేనైన ఘనుని ప్రాణము పోవున్
కాలము గూడక తల దెగి
వ్రాలిన ప్రాణంబు మగుడి రాదె తలంపన్.

345


సీ.

శాలివాహనుచేతికోలచే విక్రమ
        శిర మట్లు దెగుచు నుజ్జయినిపురము
నందు సాహసమూర్తి యంగన ముందర
        బడుటయు నాకాంత భట్టి జూచి
గర్భములో నున్న యర్భకు వెడలించి
        యతనిచేతికి నిచ్చి యగ్ని జొచ్చె
భట్టియు నాబాలు పట్టభద్రుని చేసి
        యేలించె నిల యెల్ల నింతలోన


ఆ.

గగనవాణి పలికె గద్దియ యెక్కంగ
పాత్రుఁడైన భూమిభర్త లేడు
గాన ధరణిలోన గప్పుడు మీరని
చెప్పె భట్టి యట్ల జేసె నంత.

346