పుట:సకలనీతికథానిధానము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

49


మత్తకోకిల.

భిల్లుఁ డొక్కఁడు వచ్చి చెప్పెను భీకరంబగు ఘృష్టి భూ
మెల్ల ద్రవ్వుచు మర్త్యులన్ వధియింప నచ్చట మానవుల్
తల్లడించుచు బారిపోయిన ధాత్రినాయక వచ్చితిన్
పల్లెలన్ వసియింప మాకిక బాసె నేమని చెప్పుదున్.

287


తరల.

అనిన వేటకు నుత్సహించి ధరాధినాథుడు సింధువా
హనము నెక్కి తదుక్తమార్గమునందు నేగి వరాహమున్
కని రయంబున వెంటబెట్టిన గాడ బారి ధరాబిలం
బునను గృంగిన గుఱ్ఱముం డిగి పోత్రివెంటనే పోవుచున్.

288


వ.

ఆభూవివరంబున డిగ్గి సాహసాంకుండు తన్మధ్యంబున భోగవతీపురంబుఁ గాంచి భోగీంద్రునిం బొడగని నమస్కరించి.

289


(ఇక్కడ నొకపత్రము జారిపోయినది.)

290


తే.

ఒసగికొని పొమ్మటన్న వాఁడోపెనన్ని
కట్టుకొనిపోవ నర్థాధికారి వచ్చి
గణిత వినుమన్న నీవును గట్టుకొన్న
వాఁడు నెఱుఁగుట యది లెస్స వలదు లేఖ.

291


వ.

అనిన నుడుగక లెఖ వినుపించిన నర్థాధికారి విశ్వాసంబునకు సంతోషించె నని మఱియు నిట్లనియె.

292


క.

తమవంటివారు స్థితి చెడి
తము నిలువుమటంచు నడుగ తమబ్రతుకునకై
తమకించ కొసగునరులకు
తమ కింపగు ఫలము లబ్బు తథ్యము సుమ్మీ.

293


వ.

అవ్విధంబు వినిపించెద నని యిట్లనియె.

294