పుట:సకలనీతికథానిధానము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

47


సీ.

ప్రథమాద్రిమణినితంబప్రదేశమ్మున
        నొక్కపద్మాకర మొప్పుచుండు
దానిలో నొకమణిస్తంభంబు భాస్కరుఁ
        డుదయింప దానును నుదయమందు
నదియు మధ్యాహ్నంబునందు సూర్యనిమోచు
        నన విని యొకసిద్ధు డరుగుదెంచి
విక్రమార్కునకు నవ్విధ మెఱిగించిన
        సాహసనృపతి యచ్చటికి నరిగి


తే.

కంభ ముదయింప దాను నక్కంభ మెక్కి
యంబుజాతాప్తుబింబంబు నందుకొనిన
చండదీప్తికి నోర్చిన సాహసాంకు
మెచ్చి కుండలీయుగళంబు నిచ్చి యనిపె.

278


వ.

అట్లు సూర్యదత్తం బైనకుండళయుగళంబు ప్రతిదివసంబు అష్టబారువులు సువర్ణంబు గురియునని విన్నవాఁడు గావున నవి గైకొని పురంబున కేతెంచునప్పుడు మార్గంబున.

274


ఆ.

ఘనదరిద్రహతిని గడుడస్సి భూసురు
డర్ధ మొసగుమనుచు నడుగుటయును
కుండలంబులమహిమ గొనియాడి విప్రున
కిచ్చి యాత్మపురికి నేఁగుదెంచె.

275


వ.

అని మఱియు నిట్లనియె.

276


క.

ధరణిక వగ్రహదోషము
దొరకిన తచ్ఛాంతి సేయ దొడరుదు రవనీ
శ్వరులు దగదైవమానుష
చరణులచే వానగురియు చందంబునకున్.

277