పుట:సకలనీతికథానిధానము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

45


వ.

అది యెట్లనిన విక్రమార్కుఁ డొక్కనాడు కొలువు కూర్చున్నసమయంబున గృత్రిమపత్నీసమేతుండై యొక్కయెంద్రజాలికుం డఱుగుదెంచి యిట్లనియె.

258


ఉ.

ఇంద్రునిబంట నేను దివిజేంద్రసమానక విక్రమార్క యీ
చంద్రనిభాస్య నిల్లడిడి శక్రవిరోధులతోడ పోరుని
స్త్రంద్రత జేయబోయెద ప్రతాపభయంకరసాహసక్రమో
పేంద్ర సమగ్రవిక్రమసమేత ? పరాక్రమ నన్ను జూడుమీ.

259


క.

అనిన గగనవీథి కెగయుచు
తనువు దిరస్కరిణి దాఁచి దర్పితగర్జా
నినదంబు చేయుచుండగ
పనిచేసినయట్ల యయ్యె నంబరవీథిన్.

260


వ.

అంత.

261


క.

కరములు బదములు శిరములు
ధరపై బడునట్లు దోప తరుణియు నాత్మే
శ్వరుగూడ బోదుననవుడు
మరణము నిజమౌనొ కాదొ మానవె యనినన్.

262


ఆ.

ఉడుగ కగ్ని నువిద యురికిన నటువలె
దలుగుటయును భటుఁడు గెలుపుతోడ
వచ్చినట్లు వచ్చి వనిత నా కిమ్మన్న
విక్రమార్కు డపుడు విస్మయమున.

263


వ.

భవదీయపత్ని త్వత్కరచరణశిరంబులు దునిసి ధరణిపై బడిన నగ్నిప్రవేశంబు చేసె ననుటయు వాఁ డిట్లనియె.

264


తే.

ప్రాణములతోడ దేవ నీపదము కొలువ
వచ్చి యుండంగ మత్కాంత చచ్చు టెట్లు