పుట:సకలనీతికథానిధానము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


తే.

రాత్రి యగుటయు నొకఘోరరాక్షసుండు
బాధపెట్టంగ నొకసతి బాతరింప
వాని వధియించి యవ్విప్రవనిత గావ
నతివ యిట్లనె నాసాహసాంకుతోడ.

200


క.

పతి నే మొరంగి యిటు లుప
పతులన్ భోగింప నాకు పతి యలి గిట్లీ
దితిజుని చేబడు మనుచును
పతి నన్ను శపింప నిట్టిపాటులు వచ్చెన్.

201


క.

పరపురుషుల నాశించిన
తరుణులకును నిందవచ్చు ధర్మము దప్పున్
విరసమున నుభయకులజులు
పరిహరణము చేతు రంత బాపము(తగులున్.)

202


వ.

అట్లు గావున రాక్షసబాధ మాన్పి నన్ను రక్షించితివి గావున తన్నిక్షిప్తధనంబు గైకొనుమని చూపిన నది తనవెంటవచ్చువైశ్యున కిచ్చి పురంబున కరిగె, నిదియుం గా కొక్కవిచిత్రంబు వినుమని యిట్లనియె.

203


క.

ధనహీనుని బోషించుట
ఘనులకు నది నైజగుణము కామాంధుని ని
ర్ధనుని ధన మిచ్చి మనుపడె
యనుపమసత్కీర్తి సాహసాంకుఁడు గడిమిన్.

204


వ.

అది యెట్లనిన.

205


సీ.

వనవాస మనుపేర జని విక్రమార్కుఁడు
        దీపించు చంద్రవతీపురమున
వీట దరిద్రుండు విప్రుండు ధనము లే
        దని దుఃఖమును బొంద విని మహేశు