పుట:సకలనీతికథానిధానము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33


వ.

ఉపదేశించి శివుం డనిపినం బురంబున కరుగునప్పుడు.

187


క.

కాయంబు కుష్ఠరోగా
పాయంబున ముచ్చిముచ్చి పడుచును విప్రుం
డాయధిపతి కెదురైనను[1]
నాయన కది యిచ్చి విక్రమార్కుం డనియెన్.

188


క.

ఫల మారగింపు నీకుం
గలరోగము లెల్ల నుడిగి కాయంబు మహో
జ్వల మగుచు నిలుచు ననవుఁడు
ఫలభుక్తిని ద్విజుఁడు రోగబాధలఁ బాసెన్.

189


వ.

ఇంక నొక్కకథ వినుమని యిట్లనియె.

190


ఆ.

మ్లేఛ్ఛమనుజుఁడైన మెచ్చిన ఫల మిచ్చు
టేమి యరుదు దలపనెంచి చూడ
సాహసాంకు మెచ్చ జను భోజ ద్వాదశ
గ్రామభూమిసురల గాఁచెగాదె.

191


వ.

అది యెట్లనిన.

192


క.

వనవాస మాఱునెలలును
జనపాలన మాఱునెలలు జరుపుట తనకుం
బనియైన విక్రమార్కుఁడు
చనియెన్ వనమునకు దగ్రసాహసవృత్తిన్.

193


తరువోజ.

ఆరీతి జని విక్రమార్కుఁడు భీక
        రాటవీస్థలి నొక్కయవనీరుహంబు
చేరియుండంగ దచ్ఛిఖరాగ్రమున
        గూళ్లు జేసి సుఖించు పక్షిపుంజంబు?

  1. డోయయ్య నాకు నిమ్మన