పుట:సకలనీతికథానిధానము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


ద్రోహిశ్రేణి దుర్మదవిద్ధున్ దురమున బటుదోర్బలమున సం
వాహం బొప్పందోలుదు లీలన్ ప్రణతులు మెలపులు భైరవవరదా!

177


వ.

అని స్తుతియించి కబంధశిరంబు లదుకంజేయుమని ప్రార్థించిన నూరకున్న శాతాసినాత్మశిరంబు త్తరింపందలంచిన నద్దేవుండు ప్రత్యక్షంబై.

178


క.

నరులకబంధంబులతో
శిరములు దగనంటికొనగ జేసెను శివుఁడున్
వరము వెసంగాంచి తనపురి
కరుదెంచెను విక్రమార్కుఁ డనుపమశక్తిన్.

179


వ.

ఇంక నొక్కటి వినుమని యిట్లనియె.


క.

ధరణిసురు గోర్కె దీర్చుట
పరమోదారులకు నెల్ల భావ్యంబు సుమీ
నరభుజుని దునిమి ద్విజునకు
సరసిజముఖి నీఁడె సాహసాంకుఁడు గడిమిన్.

180


వ.

అది యెట్లనిన.

181


సీ.

ఉజ్జయనీపురి నొక్కవిప్రుఁడు కమ
        లాలయుఁడనువాఁడు లలితమూర్తి
క్షితి చూడ నేఁగి కాంచీపురంబున నొక్క
        నరమోహి ననియెడునలినముఖిని
వేశ్యవాటికలోన వీక్షించి రతి గోరి
        యడిగిన దనవంక కసుర యొకఁడు
వచ్చి యెవ్వరినైన వధియించు నన విని
        చనుదెంచి విక్రమార్కునకు జెప్ప