పుట:సకలనీతికథానిధానము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


నిది లక్షణములు ముప్పదిమూఁడు కలుగు భూ
        (వరుని)రక్తంబున బలి యొనర్చి
ననుగాని యుదకపూర్ణంబు గా దనవిని
        యది సేయలేక వాఁ డలమటింప


తే.

చారు లెఱుగింప విని (సాహసాంకనృపతి)
సరసి చూడంగ నేఁగి యచ్చంద మెఱిగి
కంఠరక్తంబు బలియీయ ఖడ్గ మెత్త
శక్తి ప్రత్యక్షమై యందు జలము నించె.

167


క.

అవ్విధము విక్రమార్కుం
డవ్వైశ్యుం డెఱుగకుండ నరిగె బురికి ని
ట్టెవ్వం డుపకృతిచేసియు
నవ్విధ మెఱిగింపకుంట యార్యగుణంబుల్.

168


వ.

అని చెప్పి విరోచనపుత్రునకు బ్రహ్మపుత్రుం డిట్లనియె.

169


క.

ఏవెరవు లేని మనుజుని
దైవము రక్షింప నొక్కదాతం జూపున్
దేవత విక్రమసూర్యుని
భూవిభునిని నడుగుమనదె పుర మేలింపన్.

170


వ.

అది యెట్లనిన.

171


సీ.

మధుమాసమున విక్రమప్రభాకరుఁ డంగ
        నాయుక్తుఁ డగుచు వనంబునందు
క్రీడింప నొక్కదరిద్రవిప్రుఁడు వచ్చి
        యనియె భూపతి జూచి యవనినాథ
చండికం గోరి నేశతవత్సరములు త
        పంబు సేయంగ నయ్యంబ రాత్రి
వచ్చి విక్రమసూర్యువలన నీకోరిక
        ఫలియించు నని చెప్పి చనియె నన్న