పుట:సకలనీతికథానిధానము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

సకలనీతికథానిధానము


క.

ఆజ్ఞాభంగము చేసిన
నాజ్ఞాపింపుదురు రాజు లధికులనైనన్
ప్రాజ్ఞులగువారి కవని ప
రాజ్ఞాభంగంబు సేయుట రుహంబగునే.

160


వ.

అనవుండు.

161


క.

(క్ష)నమున వచ్చెదనని తా
జని నాయాజ్ఞకును వెఱచి చనుదెంచెను వీఁ
డని పంచరత్నములు (పరి)
జనునకు గృప జేసి వైశ్యజనునకు నంతన్.

162


ఆ.

పదునొకండుఁ గోట్లు పసిడిటంకంబులు
మణుల విలువచేసి మనుజవిభుఁడు
నూరుభవున కిచ్చె నున్నతసత్కీర్తి
సాహసాంకునకును సాటి గలరె.

163


వ.

మఱియు నిట్లనియె.

164


క.

పరుల మనస్తాపం బే
పురుషుం డణఁగించు ప్రాణముల నిచ్చైనన్?
ధర నట్టిమనుజునకు నిహ
పరసౌఖ్యము లబ్బుననుచుఁ బల్కుదు రార్యుల్.

165


వ.

అది యెట్లనిన.

166


సీ.

ధనపాలుఁడనువైశ్యతనయుండు కాశ్మీర
        జగతి గట్టించెఁ గాసార మొకటి
నది యెల్లకాలంబు నంబుహీనంబైన
        జింతింప నాకాశసీమ పలికె