పుట:సకలనీతికథానిధానము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


కవిత్వము

ఈయనరచనలో క్త్యార్థకసంధులు మొదలైన లక్షణాతిక్రమణము లటనట గానవచ్చుచున్నవి. నాటి కావ్యములు పెక్కిటి యందివి సామాన్యములే గాన గుణమహితమగు నిట్టి కావ్యమందవి యంతగాఁ బరీగణనీయములుగావు. వివిధములగు కథల సంకలనమైన యీ కావ్యమునందలి యీతని కథనవైఖరియును, శైలియును, యాయా రస భావములకు పరిపోషకములుగా నమరి విసువుపుట్టింపనివియై మనోహరముగా నున్నవి.

సంస్కరణము

దీని ముద్రణమునకు ప్రాచ్యలిఖతపుస్తకాగారముననున్న ప్రతులే యాధారములు. D-Nos. 857, 858, 859 కలవి మూడు ప్రతులు కలవు, D-No. 857 కాగితపు బ్రతిని ఆదినుండి చతుర్థాశ్వాసమునఁ గొంతవఱకుఁ గలదు. D-No. 858 కాగితవుఁ బ్రతిలో దీని తర్వాతి భాగముగలదు. మూడవదియగు D-No. 859 తాళపత్ర ప్రతి, వీని మాతృక. గ్రంథపాతము లెక్కువగా నేర్పడినవి. అచ్చటచ్చట శైథిల్యములుగూడగలవు. సాధ్యమైనంత వఱకు సంస్కరింపఁబడినది. గ్రంథపాతములు లక్షణదోషములు సందిగ్ధపాఠములు మున్నగునవి ప్రశ్నార్థకాది చిహ్నములతో సూచింపబడినవి.

దీనిని ముద్రణమునకు సిద్ధపడిచి ప్రూఫులనుజూచిన శ్రీతాడూరి లక్ష్మీనరసింహారావు బి. ఎస్. సి. గారు, లైబ్రరీ పండితులు సంస్మరణీయులు, దీని ముద్రణమునఁదగు శ్రద్ధగైకొని మేలుగ రూపెత్తించిన “రత్నం ” ముద్రణాలయమువారికిఁ గృతజ్ఞతాభివందనములు.

టి. చంద్రశేఖరన్