పుట:సకలనీతికథానిధానము.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

సకలనీతికథానిధానము


ఆ.

అర్ధరాజ్య మీయ నాశ్రీసుదర్శన
ద్విజుఁడు యౌవరాజ్య విభవ మొంది
యుండునంత వైశ్యుఁ డొకదూతఁ బుత్తెంచె
జలధి నోడ యెక్కి చనదలంచి.

197


క.

శంసాపూర్వంబుగ ద్విజ
హంసుఁడు కల మెక్కి విట్సహానుగుఁడై యా
హంసద్వీపమునకుఁ జని
హంసాశ్రయుఁడైన యొక్కయతివరుఁ గాంచెన్.

198


సీ.

అయ్యతివరుకృప హస్తివక్త్రునిఁ గాంచి
        నుతియించి తద్వరోన్నతవిభూతి
దండ్రి యీయంగ శ్రీదర్శనాఖ్యు డనంగ
        మంజరిఁ బెండ్లాడి మహితలీల
నభ్రగయానుఁడై యాత్మపురమున
        కేతెంచి పద్మేష్ఠ బ్రీతి కూడి
భార్యలును దానును బ్రహ్మయానతిచేత
        శ్రీదర్శనుఁడు యక్షసిద్ధి వడసె


ననుచుఁ గథ చెప్పి యేను నీయడవిలోన
వారిచరితంబు దలఁపుచు వచ్చివచ్చి
యలసిపడియుండి మిము గంటి ననుచు మ్రొక్క
...........మెచ్చి మృగాంకదత్తుఁ డపుడు (?)

199


సీ.

రాధాపురీవరరమణుఁ డుగ్రభటాఖ్యుఁ
        డతనిభార్య మనోరమాభిధాన
యమ్మహీపతియున్న యాస్థానమున కొక .
        నర్తకుం డరుదెంచి నాట్య మాడ