పుట:సకలనీతికథానిధానము.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

291


గీ.

అనుచు మౌని పలుక నద్ధరణీశుండు
బ్రహ్మవిష్ణుశివులఁ బ్రస్తుతించి
కరణ వడసి దైత్యకామిని గైకొని
యాత్మపురికి నరిగెనని వచించె.

191


వ.

అంత.

192


క.

శ్రీదర్శనాఖ్యుఁడను త
ద్భూదేవునియింట నన్నభుక్తుండగుచున్
వైదికగేహము వెలువడి
యాదట నొకసరసిఁ గాంచి యాతీరమునన్.

193


సీ.

ఒకకాంతఁ బొడగని యొయ్యన నడిగిన
        శ్రీదర్శనునకు నచ్చెలువ వలికెఁ
బద్మగర్భతనూజఁ బద్మిష్ఠ నేముఖ
        రాఖ్యుండు తోఁబుట్టెనన్న నాకు
మాతండ్రియును నేను నాతని వెదుకంగ
        ధర బరిభ్రమియింపఁ దస్కరుండు
మాతండ్రిఁ జంపి నెమ్మది తనసుతునకు
        నీయఁగాఁ దలఁచిన నల్గె నతఁడు


వాఁడు నను వెళ్ళఁగొట్టిన వచ్చి యిచట
తండ్రితోఁబుట్టు వని మదిఁ దలఁచితలఁచి
దుఃఖచింతావశమ్మునఁ దూలుచుండి
నిన్నుఁ బొడగంటి సంతోషనిధియుబోలె.

194


క.

అనునంత ముఖరకుండును
దనసోదరి వెదకి కాంచి తండ్రిమరణ మ
వ్వనరుహముఖి వినిపించిన
విని దుఃఖితుఁ డగుచు మాళవీయపురమునన్.

195


వ.

ప్రవేశించి యారాజునకుం దనమంత్రవిద్యను వాతరోగంబు నడంచిన నమ్మహీశ్వరుండు.

196