పుట:సకలనీతికథానిధానము.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

సకలనీతికథానిధానము


ఉ.

యక్షిణికిన్ మహీసురన కంగన యుద్భవమైన నప్పుడా
యక్షిణి భూమిదేవునకు నాత్మజ నిచ్చి పినాకపాణి ఫా
లాక్షుని గొల్వనేగిన దదాత్మమనఃస్థితి బాయలేక దే
హక్షయ మొందిపోవుటయు నంగన యక్షుని గూడె విప్రునిన్.

174


గీ.

అట్టహాసుఁ డనెడి నభ్రచరేంద్రుఁ డ
య్యక్షిణీతనూజ నబ్జవదన
బలిమిఁ బట్టుకొనుచు నలకాపురంబున
కరగుటయును గిన్నరాధివరుఁడు.

175


క.

ఆ యక్షిణీతనూభవ
ప్రాయము నీక్షించి యలిగిపట్టిన వాఁడా
కాయంబు విడిచి హరియై
పాయకఘోరాటవులను భ్రమతం బాఱున్.

176


గీ.

అని శపించిన నక్కన్య నచలపుత్రిఁ
గొలువగాఁ బెట్ట నదియునుఁ గొలుచుచుండ
శారదపీఠమైన కాశ్మీరధరణి
మండలం బేలు నందనమనుజవరుఁడు.

177


సీ.

ఒకనాఁడు ద్వాదశి నుపవాసమునఁ బొంది
        కలలోన నాయక్షకన్యఁ గాంచి
దర్పగానలశిఖాదందహ్యమానుఁడై
        ధరణిభారము మంత్రితతికి నిచ్చి
తప మాచరింపుచు తరణిపైఁ గూర్మి ద
        శావస్థలనుఁ బొంది సమయుతఱిని
శంకరరూపుఁడై చనుదెంచి యొకవిప్రుఁ
        డనియె భూవరుఁడు దన్నడుగుటయును


గీ.

శైవశాస్త్రోక్తమైన భస్మంబు దాల్చి
శ్రీగిరిస్థలిఁ దప మేను సేయుచుండ