పుట:సకలనీతికథానిధానము.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

సకలనీతికథానిధానము


ననిన మునిపతి యాపుష్కరాక్షునకునుఁ
బ్రియము రెట్టింపఁ గన్నియఁ బెండ్లి చేసి
యనుపుటయు వ్యోమగతిఁ బురి కరిగి రాజ్య
మనుభవింపుచు నుండె మహావిభూతి.

110


వ.

అని యిట్టిచిత్రకథావినోదంబులం బ్రొద్దు పరపుచు మృగాంకదత్తుం డొక్కనాఁడు మృగాంకవతీవిరహంబు సైరింపఁజాలక ప్రధానిపుత్రులలోఁగూడ మహాటవికిం జని యందు.

111


క.

శశశోణితలోహితుఁడై
దశశతకిరణుండు చరమదశ ప్రాపించెన్
దశదిశలు కృష్ణనాగవు
దశపొందిన రవియు భోగతలమణియయ్యెన్.

112


వ.

అంత.

113


క.

రాతిరనుభిల్లి కర్ణపు
కేతకిగతి చంద్రుఁ డుదయగిరి యెక్కిన కా
ళీతరుణి శ్రుతి కరోట
శ్వేతద్యుతి యగుచుఁ జంద్రబింబం బమరెన్.

114


వ.

అంత నట నొక్కబ్రాహ్మణుం గని యందు.

115


గీ.

ఆమృగాంకదత్తుఁ డాప్తులుఁ దా నొక్క
శుష్కతరువునీడ సుప్తిఁ బొంది
మేలుకనియు చూడ మెలకువ నాచెట్టు
పండుటయునుఁ దినిన బ్రాహ్మణుడయి.

116


ఉ.

తానును వచ్చి తత్ఫలవితానము భుక్తి గొనంగ వార లా
మ్రానితెఱం గదేటిదన బ్రాహ్మణుఁ డిట్లని పల్కె వీఁ డయో
ధ్యానిలయుండు విప్రుఁ డితనాత్మతనూజుఁడ నేను క్షామతన్
గాని వహింప మత్పిత ఫలంబులు నా కిడి స్నానమాడగన్.

117