పుట:సకలనీతికథానిధానము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

సకలనీతికథానిధానము


వ.

అనవుండు.

120


మ.

బలిదైతేయుఁడు నారదుం బలికె భూభాగంబునన్ విక్రమా
ర్కులసత్కీర్తులు ప్రస్తుతింతురు బుధుల్ రూపింపగా నట్టివా
రలకీర్తుల్ వినుపింపవే యన నుదారస్ఫారకీర్తిచ్ఛటా
నలితాకాశుడు దాని వానిగుణముల్ వర్ణింపగా శక్యమే.

121


క.

వెయిమాడ లిచ్చు జూచిన
అయితం బవి యిచ్చు బలుక హసితుండై ల
క్ష యొసంగు విక్రమార్కుఁడు
దయ మెచ్చిన కోటి యిచ్చు దగ నర్ధులకున్.

122


వ.

అని వినిపించి మఱియు నిట్లనియె.

123


క.

ఊహింప విక్రమార్కుని
సాహసము నుదారగుణము చర్చింపంగా
నాహరున కైన వశమే
బాహాబలుఁ డతని వినుము బలిదైత్యేంద్రా!

124


ఆ.

సాహసాంకు డిట్లు జగతివృత్తాంతంబు
లరయబంప బోబోయినట్టిజనము
లరసివచ్చి చెప్పి రాశ్చర్య మొక్కటి
చిత్రకూటనగ విచిత్రమహిమ.

125


ఉ.

చెప్పిన విక్రమార్కనృపశేఖరఁ డగ్గిరి చూచు వేడ్క దా
నప్పుడ యేగి యందుల శివాలయనైకటభూమియందు బా
రప్పులు పాపకర్ముతను వంటిన కాటుకవర్ణ మౌటయున్
బొప్పగ పుణ్యునిం దనువు సోఁకిన దుగ్ధము లౌట చూచుచున్.

126