పుట:సకలనీతికథానిధానము.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

సకలనీతికథానిధానము


ఉ.

అంత కళింగసేన తనయాత్మజ నన్నరవాహనాఖ్య శు
ద్ధాంతము సేయ వత్సవసుధాధిపుతో నెఱిఁగింపబంపి సు
స్వాంతత తత్కరగ్రహణచర్య ఘటించిన ఖేచరేంద్రుఁడై
యింతయు నేలె యక్షులు మహీజనులున్ వినుతింపఁ బూజ్యుఁడై.

80


సీ.

ఉద్యానవనమున నొకనాఁడు నరవాహ
        నుండు కేళీరతి నుండునంత
నిద్దఱు నృపసుతు లేతెంచి మ్రొక్కిన
        నెవ్వరు మీరన్న నిట్టు లనిరి
వైశాలికాపురవరుఁడు నందనభూమి
        పతిపుత్రులము వాదమతుల మగుచు
వచ్చినారము గజవాహాదికత్వరి
        తములకుఁ బణము పంతబు జేసి


దేవ మాలోని వాదంబు తీర్పవలయు
నచటి కేతెమ్ము నావుడు నరద మెక్కి
యరిగె వారును దాను నప్పురము సొచ్చి
యంతిపురివారు పూజింప నధివసించి.

81


గీ.

వారు దెచ్చినట్టి వారణఘోటక
జవము చూచి మెచ్చి సామజమునె
గెలువు చేసి వారిచెలియలిఁ గైకొని
యాత్మపురికి మగుడ నరుగుదెంచి.

82


క.

జనకునకు మ్రొక్కి భూపతి
యునుపగ కనకాసనమున నున్నట్టితఱిన్
జనుదెంచి యొక్కకోమటి
వినమితముఖుఁ డగుచు పతికి విజ్ఞాపించెన్.

83