పుట:సకలనీతికథానిధానము.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

సకలనీతికథానిధానము


ఉ.

అంత కళింగసేన ద్విజునాప్తుని వత్సనరేంద్రుపాలి కే
కాంతమునందుఁ బంపి తనయాగమనం బెఱిఁగింపుమన్న వా
డంతయు నేగి చెప్పుటయు నద్ధరణీవరుఁ డాత్మ నెంతయున్
గాంతి వహించి మంతిరి యుగంధరరాయనికి న్వచింపుచున్.

69


క.

కోరంగఁదగు పదార్థము
చేరిన వేగంబ నరుఁడు చేకొనకున్నన్
చేరినరత్నం బొల్లక
వీఱిఁడియై గాజుపూస వెదకుటగాదే.

70


గీ.

గృహము గట్టించు వైవాహకేళి కనిన
నట్ల సేయంగ నొక్కవిద్యాధరుండు
పురికి నేతెంచి వత్సభూభుజున కనియె
నీపురంబునఁ గొన్నాళ్లు నిలుతు ననుచు.

71


సీ.

అట్టివిద్యాధరుం డాది కళింగసేనా
        నురాగంబున హరుని గూర్చి
తప మాచరించి యత్తరుణిఁ బొందగఁ గోరి
        యక్షేశపుత్రుఁడై యవతరించ్చెఁ
గాన నాతడెఁ వత్సకాంతుని పురి నిల్చి
        మాయచే నక్కాంతమందిరంబుఁ
జెంది రాత్రి కళింగసేనను భోగించి
        కన్యకఁ గాంచి యక్కాంత కిచ్చి


చనియె నిది వత్సవిభునకు సచివవరుఁడు
తెలియఁజెప్పిన కాంతపైఁ దలఁపు విడిచె
మదనమంచుక నాఁగయమ్మగువపుత్రి
సకలవిద్యలు నేర్చె ఖేచరునివలన.

72