పుట:సకలనీతికథానిధానము.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

259


ఉ.

అంతఁ గళింగదత్తుఁడు నిజాత్మజ యమ్మయజాసఖీత్వని
క్లాంతిఁ గృశించునేయనఁగఁ గ్రమ్మఱ నమ్మయపుత్రి వచ్చినన్
సంతసమంది పూజలు ప్రశస్తముగా ఘటియించె నంత న
భ్యంతరవాసఁ జేసిన బ్రియంబున భూపతి సమ్మతించినన్.

46


క.

మయపుత్రి చెలియఁ దోడ్కొని
స్వయంప్రభయను దనభగినిసన్నిధికిఁ గడు
రయమున నరిగర్చితయై
వియదటయానమునఁ బురికి వేగమె మఱలెన్.

47


గీ.

మఱియు నొకనాఁడు మయజనమ్మగువ యనియె
సుదతి మాయత్తవారిల్లు చూడవలయు
ననుడు శ్వశ్రూగృహంబు దుఃఖాయతంబు
సర్పసంశ్రితచందనశాఖవోలె.

48


వ.

అది యెట్లనిన.

49


సీ.

ధనపాటలీపురధాముండు పాటల
        పుత్రకుండును వణిక్పుత్రుతనయ
కీర్తిసేనానామ కీరభాషిణి దేవ
        సేననామునిపత్ని చిగురుబోణి
పురుషుఁడు పరదేశమునకుఁ బోయెదనన్న
        నత్తమామలు దుష్టులని వచింప
...............................
        .........................


గీ.

వేశ్య వైతివి నాయిల్లు వెళ్ళుమనిన
దైవగతి నిల్లు నిశయందుఁ దస్కరుండు
త్రవ్వుటయు నింటిలోఁగల ధనము గొనుచుఁ
గన్నమున వెళ్ళి పురుషసంగతికిం బాసి
సార్థసంగతిఁ గాననస్థలికి నరిగె.

50