పుట:సకలనీతికథానిధానము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

255


వ.

అని చెప్పె నంత కళింగదత్తునిభార్య తారాదత్త పుత్రిం గాంచిన సంతోషరహితుండై సచివులంజూచి కన్యకాజన్మదుఃఖోపశాంతిగా నిట్లనియె.

23


గీ.

ధర నహింసకంటె ధర్మంబు సన్యాస
పరతకంటె ధనము కరుణకంటె
పరమమైన మోక్షపదమును లేదని
దయయు క్షమయు మునులు దాల్తు రెపుడు.

24


తరల:

ధరణినాథుఁడు దొల్లి భార్యలు దాను వేఁటకు నేగి మ
ద్యరసముం గొని (చొక్కి) నిద్రితుఁడైనఁ గాంతలు తాపసే
శ్వరునిసన్నిధినున్న భూపతి సౌప్తికంబున బాసి దు
ష్కరతపోనిధి గాముకుండని ఖడ్గసంహతి చూపినన్.

25


క.

మునివరుఁడు క్షమయుఁ గరుణయుఁ
దనకుఁ దను త్రాణములుగఁ దాలిచి నృపనం
దనుమీఁద నలుగఁడయ్యెను
ముని తనువును ఖడ్గధార మోవకయుండెన్.

26


వ.

మఱియునొక్కకథ వినుమని కళింగదత్తుఁ డప్పుడు.

27


గీ.

భార్య వరుఁ బాసి వైరాగ్యపరత నరగ
ధవుఁడు ప్రార్థించి పట్టినఁ దరుణివ లికె
కాయకు మస్థిర మందు భోగంబు దలఁప
స్వప్నసౌఖ్యంబు వినుమని వనిత మఱియు.

28


క.

పలలాస్థి సిరామేదః
కలిలానిల చర్మపూతిగంధస్థితులన్
వలకాఁడు దనువు సరిగా
దలతురు పరమాత్మ విదులు తత్పరదృష్టిన్.

29