పుట:సకలనీతికథానిధానము.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

సకలనీతికథానిధానము


చ.

సచివుఁడు బుద్ధి చెప్పిన రసాతలనాథుఁడు వేఁట యేఁగి త
ద్విచికిలకుంజమధ్యవినివేశుల నిద్దఱఁ గాంచి యమ్మలీ
మ్లుచులను భీతి వారిఁ దనముందటిం బిలిపించి! యేల మీ
రిచట వసించినారనిన నిట్లని పల్కె నొకండు భూపతిన్.

17


క.

వినుము నృపాలక! జననీ
జనకులఁ బెడబాసి బాల్యసమయంబున బ్రా
హ్మణసుతుఁడ నయ్యు నాయుధ
జనసాహాయ్యమున భ్రష్టచర్యుఁడనైతిన్.

18


గీ.

అంత నొక్కవేళ నంగడి నొకబండి
యెక్కి పెండ్లికొమరుఁ డింతిఁ గొనుచు
వచ్చుచోట రాజువారణ మెగిచిన
పడుచు డించి వాఁడు పాఱుటయును.

19


మత్తకోకిల:

కన్నె భీతిఁ దలంక నే నాగంధదంతికి నడ్డమై
వన్నెఁ దప్పకయుండ డించిన వారిజానన కన్నులన్
సన్న సేయుచు నాథు నొల్లక స్వామి వీవని ప్రేమతో
నన్ను జూచిన దేవతాసదనంబునం బడియుండితిన్.

20


గీ.

మామ యెఱుఁగకుండ మధ్యమనిశయందు
భోజనంబు గొనుచు పొలఁతి వచ్చె
దానిఁ గొంచు వచ్చి డాఁచితి ననుచును
నిజము పలుకుటయును నృపతి మెచ్చి.

21


క.

ఆకన్యక నావిప్రుని
గైకొమ్మని ముదలపెట్టె కన్యయు వానిన్
గైకొనియె రహితసత్వ
వ్యాకులకాతరుల కేల వలతురు కాంతల్.

22