పుట:సకలనీతికథానిధానము.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

సకలనీతికథానిధానము


గీ.

కరవుచే నొచ్చి యాకటఁ గ్రాఁగ విప్ర
భోజనము వెట్టుచును వారిభుక్తశేష
మస్మదధిపతి భుజియించి యల్పభుక్తి
శోషతనుఁ బొంది భర్త యసువులఁ బాసె.

9


క.

ఏనుఁ దదనుగమనంబున
భూనుత జాతిస్మరత్వమునఁ బుట్టితినాన్
మానవపతియుం దెలిసెను
ధ్యానంబున నాఁటి దేవదాసుఁడ ననుచున్.

10


గీ.

పొలఁతి! జాతిస్మరత్వవిభూతి మనకుఁ
బొడమె పుణ్యంబుచేనని భూవరుండు
తల్లిదండ్రులు, మామ, మాతామహుఁడును
సకలజనములు ధర్మంబు సాటిగలరె!

11


సీ.

మందాకినీతటమహిని విప్రుండు చం
        డాలుండు తనదు ప్రాణములు విడువ
నిరశనవ్రతపరనిష్ఠ నుండుచు మత్స్య
        ఘాతకు ల్మీనభక్షణము సేయ
విప్రుండు వారల విధివేడ్కఁ గనుగొనఁ
        జండాలునకు నదసహ్యమైన
ప్రాణికిం బ్రాణి నాహారంబు సేయు నీ
        ప్రాణ మేటి కీ నని యాత్మ దలఁచి


గీ.

యంత మృతి బొంది యిరువురు నమరపురికి
నరిగి క్రమ్మఱ జనియించి రవనియందు
జాలిసుతుఁ డయ్యె విప్రుండు శ్వపచుఁ డధిప
నందనుం డయ్యె హింసఁ గానంగఁ దగదు.

12