పుట:సకలనీతికథానిధానము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

సకలనీతికథానిధానము


ఉ.

ద్రోహి ప్రధాని యంచు తలద్రుంచగ పంచిన వాఁడు మున్నె యా
యూహ యెఱింగి పాసి చని యొక్కమహీసురమంత్రవిద్యచే
బాహుబలంబు గాంచి నిజపార్ధివునిం దెగటార్చి తద్ధరా
వాహినులన్ వరించె గుణవంతులకున్ సిరి వొందకుండునే.

336


క.

అని చిత్రకథలు హితునకు
వినిపింపఁగనంత నిశకు వేఁకువ బొడమిన్
దనుజేంద్ర హృదయచింతా
ఘనతిమిరముతోడ నంధకారము విచ్చెన్.

337


క.

శౌర్యతరవిమతశిక్షా
వార్యక్రోధమున నరుణవర్ణం బగు నా
సూర్యప్రభువదనంబన
సూర్యప్రభ యంకురించె సురపతివంకన్.

338


దోదకవృత్తము:

వాసవుఁ డాశ్రుతవర్మనుఁ గొంచున్
గాసిలి వచ్చిన గార్ముకశక్తిన్
రాసులుగా సురరాజి శిరంబుల్
భూసతికిన్ మణిభూషలు చేసెన్.

339


వ.

మఱియును.

340


చ.

హరవరలబ్ధశక్తి నమరాధిపతిన్ శ్రుతవర్మతోడ సం
గరమునఁ దోలి దానవనికాయము ప్రస్తుతి సేయ శూలి ఖే
చరకులచక్రవర్తిపదసంస్థితుఁ చేయఁగ దివ్యకన్యకా
పరిణయవృత్తి జెంది నిజపట్టణ భూస్థలి కేగె నున్నతిన్.

341


వ.

అని యుపన్యసించి.

342