పుట:సకలనీతికథానిధానము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

సకలనీతికథానిధానము


క.

శుభమూర్తంబున సూర్య
ప్రభునకు భూతాసనంబు బంధురహేమ
ప్రభగ విమానమ్మును నతి
విభవముగా నొసగికొనుచు వెడలెన్ బురమున్.

327


సీ.

అట్లు సూర్యప్రభు నతలంబునకుఁ గొని
        యరిగి మయుండు ప్రహ్లాదముఖ్య
దైత్యాధిపతులనందనల కరగ్రహ
        ణం బొనరించి యన్నాకపతికి
బ్రతిగాగ విద్యాధరత్వదీప్తునిఁ చేసి
        మాయాదివిద్యాసమర్థుఁ జేయ
నింద్రుండు మనుజునికి కీవిద్య లేటికి
        నిచ్చెదరని దూతఁ బుచ్చుటయును


బలియుఁ బ్రహ్లాదుఁడును మయుఁ బలుకుమనినఁ
బలికె నింద్రుండు తగవేమి పట్టిచెప్పెఁ
దాను వృత్రాదిరాక్షసతతులయెడల
నెట్టి తగవున నడచె దానెఱుఁగడోటు?

328


క.

అని దూత వోయి చెప్పిన
విని శ్రుతవ ర్మనెడు మనుజువిభుమిత్రునిఁగా
నొనరించి సూర్యవిభుతో
ననికినిఁ గొనితెచ్చి నిర్ణరావలి గొలువన్.

329


చ.

మయుఁడు పురారిసత్కృప నమర్త్యవిభీషణమైన సాయకో
చ్చయమును జాపమున్ నృపతి చంద్రభపుత్రున కిచ్చి దానవ
ప్రియముగ నాజికిం బనిచి భీషణదానవసైన్యయుక్తుఁడై
రయమునఁ దత్సహాయత దురం బొనరించె సురేంద్రసేనతోన్.

330


వ.

అంత.

331