పుట:సకలనీతికథానిధానము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


వ.

అని విచారించి స్వకీయభార్యలైన త్రిశతసంఖ్యాకామినీజనంబుల విడిచి యాత్మాగ్రజుండైన విక్రమార్కునిం బట్టంబు గట్టి భట్టి దొల్లిటియట్ల యమాత్యకృత్యంబునకుం బ్రతిష్ఠించి రాజయోగియై యరుగుచున్న నతనిభార్యాశతత్రయంబును జనుదెంచి యిట్లనిరి.

89


ఆ.

ఏమి సేయువార మిటువలె మము డించి
నీవు చనినపిదప నృపవరేణ్య
యనిన గదుట నూలు నాకులు తాడిని
గలిగియుండునట్టికాలములును.

90


వ.

విధవాత్వంబు లేకుండునట్లుగ వరం బిచ్చితి బొండని చనియె. నాటనుండియు శూద్రకులంబు గొందఱు మున్నూ రనంబడి రంత.

91


స్వాగతము.

విక్రమార్కుఁ డుఁరు విక్రమ మొప్పన్
శక్రులీల బురసంహరుమాడ్కిన్
చక్రిభంగి బరచక్రాధిపులన్?
విక్రమించి పృధివీతలమేలన్.

92


వ.

అతం డొక్కనాఁడు మృగయార్థం బడవి కరిగి.

93


సీ.

గహ్వరద్వత్సమారంహసాహసభీమ
        సింహపోతంబుల చెండి చెండి
అద్రిసన్నిభశరీరోద్రేకమదపూర్ణ
        భద్రసింధురములఁ బట్టి పట్టి
దుర్గమాభీలవిధుంతుదోద్భటవక్త్ర
        శార్దూలములవీఁపు చరచి చరచి
కోలాహలాభీలకాలాభ్రసన్నాహ
        కోలసమూహంబుఁ గొట్టి కొట్టి