పుట:సకలనీతికథానిధానము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

223


క.

తిత్తియు రత్నముఁ గానక
సత్తుగఁ దన కొసఁగుననుచు జలజానన సం
పత్తి దినవ్యయము సేయుచు
హత్తి ననుం గలయుచుండు నంతట యేనున్.

204


వ.

ఈతిత్తికథ బయలుపడకుండంగొనువాఁడనై యుదారునికిం దిత్తియున్ననెల వెఱింగించి రాజున కెఱింగింపుమని పంపిన.

205


సీ.

రాజైన సింహవర్మక్షమాధిపుఁ గాంచి
        కంటి నాసొమ్ము కీఁగడ, నృపాల
రాగమంజరియింట రత్నంబుఁ దిత్తియు
        నున్నవి పిలిపించుఁ డువిద ననుడు
నటమున్న యేను దదంగనయింటను
        నున్నవాఁడను గాన నన్నతోడ
నజినరత్నంబు భస్త్రి?యు మీగృహమ్మున
        వసియించునని సింహవర్మ యెఱిఁగి


తే.

యడుగ మిముఁ బిలువఁ బంపిన నర్ధదత్తు,
వారు మారాగమంజరివంక వత్తు
రెవ్వఁ డిచ్చేనొ యనుచు భూమీశునొద్ద
ననకయుండిన నపరాధు లగుదు రీరు.

206


క.

అని యేను దలఁగుటయు న
మ్మనుజేశుని భటులు రాగమంజరిఁ గొంచున్
జనుటయు నరపతి యడిగిన
వనితయు నేఁ జెప్పినట్టి వచనమె పలుకున్.

207


వ.

ఆతిత్తియు రత్నంబును దెప్పించి యుదారున కిచ్చి యర్థపతిం దల ద్రెగవేయుమని పంపిన నుదారుండు సింహవర్మ పాదంబులం