పుట:సకలనీతికథానిధానము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

సకలనీతికథానిధానము


సీ.

శంకరుఁ డిచ్చిన చర్మభస్త్రిక పైఁడి
        గురియంగ ధనినంచుఁ గ్రొవ్వి యోరి!
మాలికకును మారమలసెద వటు చూడు
        మనిన నుదారుండు సాక్షివెట్టి
వచ్చి నా కెఱిఁగింప వాఁ డెఱుంగకయుండ
        నడురేయి యిల్లు కన్నంబువెట్టి
చర్మభస్త్రిక రత్నసహితంబుగాఁ గొని
        చని యేను రాగమంజరికి నిచ్చి


తే.

బొంది వచ్చితి నంతట ప్రొద్దువో ను
దారకుని లేపి దొంగలు ద్రవ్వి రత్న
చర్మభస్త్రులు గైకొని చనిరటంచు
కూయు వెట్టించి, యాపొరుగులకుఁ జెప్పి.

199


వ.

అయ్యుదారుండును రాజుసముఖంబునకుఁ జని యథదత్తుండు మదీయరత్నచర్మభస్త్రికలు దివియించెనని విన్నవించిన, నతనిఁ బట్టి తెప్పించిన నేఁ దీయించుట లేదనిన, నుదారుం డిట్లనియె.

200


తే.

గతదినంబునఁ దన కూర్చు హితుఁడు నన్నుఁ
బౌరజనములు సాక్షిగాఁ బ్రల్లదంబు
లాడి బ్రతుకుదుగాకని యరిగి వాఁడు
సురగె రమ్మని పిలిపించు నరవరేణ్య!

201


ఆ.

అనినఁ బిలువఁబంపె నాయొంతగాఁడునుఁ
దనకుఁ గఱపినట్ల తలఁగిపోయె
వానిఁ దెమ్మటంచు వసుధేశ్వరుఁడు నర్థ
పతిని బట్టి కొట్టి బందిఁబెట్ట.

202


వ.

అంత.