పుట:సకలనీతికథానిధానము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

213


వ.

అట్లు గావున నాత్మమిత్రపరిత్యాగంబును బరదేశభోగంబును నుచితంబు గాదని కాళింది నొడంబరచి, పాతాళంబు వెలువడి మిత్రులం గలసియుండు నప్పుడు పుప్పోద్భవుం డిట్లనియె.

146


ఉత్సాహం:

రాజవాహన మమ్ముఁ బాసి ధరాకరండ్రము నీవు వి
భ్రాజమానుఁడ వగుచుఁ జొచ్చినఁ బ్రాప్తదుఃఖము బొంది మే
మీజగంబున సంచరింపుచు నిమ్మహీస్థలి నున్నస్వా
రాజసన్నిభుఁ బట్టికొని యొకరాజధానికి వచ్చితిన్.

147


ఆ.

వాఁడు చెలిగాఁగ నప్పురవరముఁ జేరి
బంధుపాలుని సఖ్య సంప్రాప్తినొంది
వాఁడు నేనును శకునంపువాంఛ నరుగ
నొంటిఁదత్పుత్రి చింతింపుచున్నవేళ.

148


వ.

మత్సఖుండైన చంద్రపాలుని శకునంబునకుఁ బెట్టి నే నబ్బాలచంద్రికం గామించి తదనుమతంబునఁ దత్పూర్వపతిని వధియించి యక్కామినిం గైకొంటి మన మప్పురంబునకుఁ బోదమని రాజవాహనుం దోకొని యవంతికిం జని.

149


క.

కుసుమపుర మేలునీతం
డసదృశగుణశాలి యనుచు నాప్తులకెల్లన్
వెసఁ జెప్పుచుఁ దత్పురవర
వసుధేశ్వర పుత్రి నయ్యవంతీకన్యన్.

150


ఆ.

రాజవాహనునకు రమణిగాఁ జేయుదు
ననుచుఁ బాలచంద్ర సతివకడకుఁ
బనిచి ప్రియము దెలిసి పణఁతికై తాఁ దిరు
గాఁడుటయును దెలిసి వీడలేక.

151