పుట:సకలనీతికథానిధానము.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

సకలనీతికథానిధానము


వ.

ఇట్లు సునీతివర్మయు, వివేకసముద్రుండును శ్రుతకీర్తియును, దండ్రి యగు రాజహంసుండును నానానీతివిశేషంబు లెఱింగించి సుతులను దిగ్విజయార్థం బనిపినం జని, వనంబున నొక్కచో నవధూతఁ గని వానితో సఖత్వంబు చేసి తదుపదిష్టమార్గంబున రాజవాహనుండు పాతాళబిలంబు ప్రవేశించుచు నాత్మామాత్యపుత్రుల నుపహారవర్మ పుప్పోద్భవా అర్ధపాల సోమదత్తులు మొదలయిన తొమ్మండ్రను వెలుపల నునిచి యొక్కరుండును వసుంధరారంధ్రంబు ప్రవేశించి.

142


ఆ.

పావకాదివిఘ్నపటలిని నిర్జించి
యురగలోక కనకపురముఁ గాంచి
యందు మయుని పుత్రియైన కాళిందిని
ననుభవించి వనిత దనకు నొసఁగ.

143


క.

ధరియింప క్షుత్పిపాసలు
వొరయని రత్నము ననర్ఘ్యమును గైకొని త
ద్ధర వెడలి, రాజవాహనుఁ
డరుగుట గని, నిలువుమనిన, నంగనకనియెన్.

144


క.

మిత్రుఁ డవన్యపుఁజుట్టము
మిత్రునిఁ బోషించుకంటె మేలునుఁ గలదే
మిత్రుల బాయుట మిక్కిలి
ధాత్రిం బాతకము గాఁగ దలఁపుదు రార్యుల్.

145


ఆ.

అరులుఁ జూచి దుఃఖ మందంగ, మిత్రులు
సిరు లఁదేల రాజ్యచిహ్నలందు
నాత్మదేశ మేలునది వైభవముగాఁక
యన్యదేశవాస మదియు మేలె.

145