పుట:సకలనీతికథానిధానము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

183


వ.

అది యెట్లనిన.

308


క.

సామరుని కోడలొక్కతె
గ్రామము వెలి ననువువిడువఁ గాననవీధిన్
వేమార బోవ మర్దలి
యామానినిఁ జూచి యేమి యని పలుకుటయున్.

309


ఆ.

ఇంటివారు వోరయేనందు బడలేక
చత్తుననుచు వచ్చి చచ్చువెరవు
తెలయననిన వాఁడు తెలిపెదనని యొక
మఱ్ఱియూడ నురి యమర్చి పలికె.

310


వ.

ఈమద్దెలమీఁ దెక్కి (?) యురి దగిల్చుకొమ్మనిన వెరవు నీవే చూపుమనిన యమ్మద్దెల యెక్కి వురి దగిల్చుకొని మృతు డయ్యెనని మఱియు నిట్లనియె.

311


క.

హీనాశ్రమంబు కంటెను
దీనున కధికాశ్రమంబు తేజము చూపున్
మానుషముఁ గలుగువానికి
హీనునిఁ గొలువంగ వలవదే దుర్గతులన్.

312


వ.

అది యెట్లనిన.

313


సీ.

మేకపిల్లలు రెండు మేతకై యెవ్వని
        గొలుతుమొకో యని తలఁపు చేసి
యొకటి సింహంబును నొకటి నక్కనుఁ గొలువ
        నందులో నక్క ప్రియంబు గల్గి
మేకపిల్లకు జాలమేత పెట్టుచునుండ
        హరి యొక్కవేళ దా నరయ దెపుడు
అంతట వర్షమే కార్ణంబు చేసిన
        క్రోష్ఠు వామేకను గుంటమీఁద