పుట:సకలనీతికథానిధానము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11


చ.

కటములు జేవురింప దెలిగన్నులవాఁ డుదయింప బాదసం
ఘటన నలంగ గోరికలు గాంచెదమంచును దీర్థయాత్రకై
యిటునటు లేఁగనేల నరు లెట్టియఘాత్ములకైన గల్గు వేం
కటమనుపేరు జిహ్వతుది గాపురముండినముక్తిసంపదల్.

54


వ.

ఇవ్విధంబున వేంకటాధీశ్వరుండు తొండమచక్రవర్తికి నభీష్టవరంబు లొసంగుచు నతని సేవ గైకొనుచుండె నింక శ్రీ శైలప్రశంసయు, విక్రమార్కాదిరాజచరిత్రంబులును వినుపించెదనని యిట్లనియె.

55


సీ.

ప్రవహించు నేయద్రిపర్యంకమునఁ బాప
        దళనోత్తరంగ పాతాళగంగ
వసియించు నేయద్రి వక్షోరుహన్యస్త
        బంధురప్రాలంబభ్రమరికాంబ
విహరించు నేయద్రి వివిధపిశాచకం
        ఠీరవుండగు బొబ్బభైరవుండు
చరియించు నేయద్రి జనులను గావంగ
        వీరమూర్తి ప్రతాప విజయమూర్తి


తే.

పర్వతాఖ్య ద్విజన్మతపఃప్రభావ
లబ్ధవరదానమస్తకాలయగిరీశ
పాదసంచారపావనప్రస్తరంబు
ప్రస్తుతింపగ దగదె శ్రీపర్వతంబు.

56


క.

శిల లెల్లను లింగంబులు
పొల మెల్లను బరుసవేది భూరుహవల్లుల్
సెలయేరు లెల్ల సురనదు
లిల శ్రీగిరిమహిమ దెలియ నెవ్వం డెఱుంగున్.

57